స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు.-2022
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకల్లో ఈ రోజు స్వాతంత్ర దినోత్సవమునకు గౌరవ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ రేగా కాంతా రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రగతికి అద్దం పట్టేలా ఏర్పాటు చేయబడిన స్టాళ్ళ నడుమ ప్రకాశం స్టేడియం నందు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ గారు, SP గారు, గౌరవ MLA లు, స్వాతంత్ర సమర యోధులు, అన్ని శాఖల అధికారులు, ప్రజలు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు.