గోదావరి వరదల సంకలనం.
జిల్లా కలెక్టర్ గారు, గోదావరి భారీ వరదలు నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన కొరకు ప్రభుత్వం చే ప్రత్యేకంగా నియమింపబడిన CCLA డైరెక్టర్ శ్రీ రజత్ కుమార్ సైని IAS గారు , పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ హనుమంతరావు IAS గారు మరియు గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారితో కలిసి గోదావరి నది ప్రవాహమును కరకట్ట నుంచి పరిశీలించి గోదావరి నదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్ల,దుమ్ముగూడెం ప్రధాన రహదారి మరియు కూనవరం ప్రధాన రహదారిని సందర్శించి గిరిజన అభివృద్ధి సంస్థ మీటింగ్ హల్ నందు నందు ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ మరియు వైద్య శాఖ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి వరదల అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.