వరద ముంపు ప్రాంతాల విస్తృత పర్యటన.
జిల్లా కలెక్టర్ గారు, గౌరవ తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారి తో కలిసి గోదావరి వరద ముంపు ప్రాంతాలైన దుమ్ముగూడెం, లక్ష్మీనగరం, సున్నం బట్టి, మరియు పర్ణశాలలో విస్తృతంగా పర్యటించి ప్రజల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదావరి ప్రస్తుతం ఉన్నటువంటి వరద పరిస్థితిని కరకట్ట నుంచి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.