గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ ITDA వారు కలిసి భద్రాచలం వంతెన పై నుంచి గోదావరి వరద ఉధృతి పరిశీలన
గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ ITDA వారు కలిసి భద్రాచలం వంతెన పై నుంచి గోదావరి వరద ఉధృతి ని పరిశీలించి, భద్రాచలం పట్టణంలో గల లోతట్టు ప్రాంతాలైనటువంటి సుభాష్ నగర్ కాలనీ ని సందర్శించి ప్రజలను త్వరితగతిన పునరావాస శిబిరాలకు తరలి వెళ్లవలసిందిగా చెప్పారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి ఇంకనూ ఎవరైనా వరద ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్నట్లయితే వారు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం మరియు సబ్ కలెక్టర్ వారి కార్యాలయం నందు ఏర్పాటు చేయబడిన కాల్ సెంటర్లకు కాల్ చేసి సహాయం పొందగలరని తెలిపారు.